Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కోస్తాంధ్ర నుంచి రూ.47937 కోట్లు - టి నుంచి రూ.41391 కోట్లు

విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదాయ వివరాలను అందించింది. ఇందులో 2012-13 సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ.1,27,566.74 కోట్లుగా ఉందని పేర్కొంది. 

ఈ మొత్తంలో ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం నుంచి రూ.47,937.22 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వస్తోంది. అలాగే, రాయలసీమ నుంచి రూ.18,215.39 కోట్లు, తెలంగాణ ప్రాంతం నుంచి రూ.61,414.61 కోట్లు చొప్పున వస్తుందని తెలిపింది. 

ఒక్క హైదరాబాద్ నుంచే రూ.20,022.21 కోట్లు వస్తున్నట్టు తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలతో కూడిన సీమాంధ్ర ప్రాంతం నుంచి మొత్తం రూ.66152.61 కోట్ల ఆదాయం వస్తుండగా, హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణ జిల్లాల నుంచి ఖజానాకు వస్తున్న ఆదాయం రూ.61414.61 కోట్లుగా ఉందని నివేదికలో తెలిపింది.

Recent Posts