Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

దూకుడు ఆగదు, ఇది నా బెస్ట్: రోహిత్ శర్మ






జైపూర్: జైపూర్ వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తులోనూ ఇదే దూకుడును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇక్కడితో తన దూకుడు ఆగదని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. టీమిండియాకు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం రావడం మహత్తర బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు. పునాది వేయడమే తన కర్తవ్యమని అన్నాడు. తాను సెంచరీ చేయడం కన్నా జట్టు విజయం సాధించడమే సంతృప్తినిచ్చిందని చెప్పాడు.
రోహిత్ శర్మ బుధవారం నాటి మ్యాచ్‌లో 123 బంతుల్లోనే 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ స్కోరులో 17 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఇక, తోటి ఓపెనర్ శిఖర్ ధావన్ పైనా రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. శిఖర్ తన సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చాడని కితాబిచ్చాడు. ముఖ్యంగా కోహ్లీ ఇన్నింగ్స్ అమోఘమని చెప్పాడు. కోహ్లీ ఆడిన షాట్లు మ్యాచ్‌ను ఆసీస్‌కు దూరం చేశాయని అన్నాడు. వన్డేలో తనకు ఇది అత్యుత్తమమైన ఇన్నింగ్స్ అని రోహిత్ శర్మ అన్నాడు. ప్రారంభాన్ని భారీ స్కోరుగా మలచడం తాను ఫలితం సాధించానని అన్నాడు.

Recent Posts