Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ముంబైలో హీరోయిన్‌తో షిండే : బీజేపీ మండిపాటు

బీహార్ రాజధాని పాట్నాలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్న తర్వాత కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ముంబైలో ఒక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని హీరోయిన్‌తో ఫోజులు దిగడం ఇపుడు పెద్ద వివాదాస్పదమైంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమై బీజేపీతో పాటు...ఇతర విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 


దీనిపై బీజేపీ నేత, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందిస్తూ హోం మంత్రిగా షిండే చేయడానికి ఏమీ లేదని, ప్రధాని మన్మోహన్ సింగ్‌లా నవ్వడం మినహా అంటూ ఎద్దేవా చేశారు. పాట్నా పేలుళ్లలో అమాయకులు మృత్యువాత పడితే షిండే ఆడియో ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ గడిపారని విమర్శించారు. 

అలాగే, సీపీఐ నేత అతుల్ రంజన్ స్పందిస్తూ పాట్నాలో పేలుళ్లు జరుగుతుంటే షిండే పాటల విడుదల కార్యక్రమంలో ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. పాట్నా పేలుళ్లతో వణుకుతుంటే షిండే మ్యూజిక్ ఫంక్షన్‌లో ఉన్నారని ట్వీట్ చేశారు.

Recent Posts